Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న రాజస్థాన్... నేడు మధ్యప్రదేశ్.. ఉప ఎన్నికల్లో "హస్త"వాసి

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ గాలి వీజడం మొదలైంది. ఈనెలారంభంలో రాజస్థాన్ రాష్ట్రంలో వెల్లడైన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. ఇపుడు మధ్యప్రదేశ్

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (19:57 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ గాలి వీజడం మొదలైంది. ఈనెలారంభంలో రాజస్థాన్ రాష్ట్రంలో వెల్లడైన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. ఇపుడు మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఉప సమరంలో హస్తం గాలి వీచింది. అలాగే, లుథియానా మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ స్వీప్ చేసింది. 
 
మధ్యప్రదేశ్‌లోని ముంగౌలి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి భాయ్ సాహెబ్‌పై 2,124 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా, తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. చివరి రౌండ్ పూర్తయ్యే సరికి 2,124 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ నిలవడంతో బ్రిజేంద్ర సింగ్ యాదవ్ గెలిచినట్టు ప్రకటించారు. 
 
కాగా, ఉపఎన్నిక జరిగిన కొలారస్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్ర సింగ్ యాదవ్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ రెండు నియోజకవర్గాలకు ఈనెల 24న పోలింగ్ జరిగింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ముంగౌలి, కొలారస్ ఉప ఎన్నికలను అటు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం సాగించాయి. అలాగే, లుథియానా మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ తేరుకోలేని షాకిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments