Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోసిపోయిన అమ్మ నివాసం వేదనిలయం... ఇక స్మారక మందిరం!

ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసమైన వేద నిలయం ఇపుడు కళ తప్పింది. నిత్యం వందలాది మంది కార్యకర్తలతో నిత్యం సందడిగా కనిపించే ఈ ప్రాంతం ఇపుడు బోసిపోయింది. జయ అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు... ఇళవరసి, సుధా

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (08:58 IST)
ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసమైన వేద నిలయం ఇపుడు కళ తప్పింది. నిత్యం వందలాది మంది కార్యకర్తలతో నిత్యం సందడిగా కనిపించే ఈ ప్రాంతం ఇపుడు బోసిపోయింది. జయ అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు... ఇళవరసి, సుధాకరన్‌లు సుప్రీంకోర్టు శిక్షలు విధించిన విషయం తెల్సిందే. 
 
నిజానికి జయలలిత మరణానంతరం పోయెస్‌గార్డెన్‌లోని ఆమె నివాసం ‘వేద నిలయం’లో శశికళ, ఆమె సోదరుడి భార్య ఇళవరసి కాలుమోపారు. అక్కడి నుంచే శశికళ చక్రం తిప్పారు. ఇప్పుడు సుప్రీం తీర్పుతో వారు జైలుకు వెళ్లనున్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ప్రస్తుతం ‘వేద నిలయం’ కళ తప్పి ఇప్పుడది ఖాళీ కానుంది.
 
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వేద నిలయాన్ని స్మారక మందిరం చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే డిమాండ్‌తో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం  వారం రోజులుగా సంతకాల సేకరణ ఉద్యమాన్ని కూడా చేపట్టారు. అన్నాడీఎంకే వర్గాలతోపాటు ప్రజల నుంచి కూడా దీనికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ‘అమ్మ’ నివసించిన వేదనిలయం తమకు మందిరంతో సమానమని, అందులో దోపిడీదారులైన ఇతరులు నివసించేందుకు అంగీకరించేది లేదని పన్నీర్ సెల్వం వర్గం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments