Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికి వివాహం చేసిన పెళ్లీడుకొచ్చిన కుమార్తె .. ఎక్కడ? ఎలా?

సాధారణంగా తమ బిడ్డలకు తల్లిదండ్రులు వివాహాలు చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ తల్లికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె వివాహం చేసింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌ నగరంలో వెలుగు చూసిన పెళ్లి కథను తెలుసుకుందాం.

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (12:11 IST)
సాధారణంగా తమ బిడ్డలకు తల్లిదండ్రులు వివాహాలు చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ తల్లికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె వివాహం చేసింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌ నగరంలో వెలుగు చూసిన పెళ్లి కథను తెలుసుకుందాం.
 
జైపూర్ నగరంలో గీతా అగర్వాల్ (53) పాఠశాల ఉపాధ్యాయురాలు. ఈమె భర్త ముకేష్ గుప్తా. వీరికి సంహిత అనే కుమార్తె ఉంది. అయితే, గత 2016 మే నెలలో ముకేష్ గుప్తా గుండెపోటుతో మరణించాడు. దీంతో గీతా విషాదంలో మునిగిపోయింది. తండ్రి ఆకస్మిక మరణంతో వితంతువుగా మారిన తల్లి నిరాశ చెందడం చూసిన కుమార్తె జీర్ణించుకోలేక పోయింది. 
 
ఎలాగైనా తన తల్లిని మామూలు మనిషిని చేయాలని నిర్ణయించుకుంది. దీంతో తల్లి ప్రొఫైల్‌ను తయారు చేసి దానిలో తన ఫోన్ నంబరు ఇచ్చి రెండోపెళ్లికి ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన చూసిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. ఆయనకు భార్య కేన్సర్‌తో మరణించింది. పైగా, రెవెన్యూ ఇన్‌స్పెక్టరు. పేరు కేజీగుప్తా. 
 
వీరిద్దరి పెళ్లికి గీతా అగర్వాల్ కుటుంబసభ్యులు, బంధుమిత్రులందరూ వ్యతిరేకించారు. అయినా సంహిత మాత్రం పెళ్లి పెద్దగా మారి తల్లికి గుప్తాతో రెండో పెళ్లి చేసింది. పెళ్లికి ముందే తల్లికి గర్భాశయాన్ని తొలగిస్తూ శస్త్రచికిత్స చేయించి పెళ్లి జరిపించింది. రెండో పెళ్లి అనంతరం తల్లి ముఖంలో విరిసిన చిరునవ్వు చూసి కుమార్తె సంహిత ఆనందానికి అవధుల్లేకండా పోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments