Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్త క్షణికావేశం.. కోడలి నిండు ప్రాణాలు బలి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (18:23 IST)
అత్తాకోడళ్ల గొడవ యుగాలు గడిచినా మారేలా లేదు. తాజాగా ఓ అత్త క్షణికావేశం ఓ కోడలి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలోని సెరాయ్‌కేలా-ఖాస్వాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఝావ్రీ గ్రామానికి చెందిన భవానీ లాయెక్ (22), ఆమె అత్త గీతా లాయెక్ మధ్య ఆదివారం మధ్యాహ్నం గొడవ జరిగింది. ఇద్దరిమధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. 
 
ఈ క్రమంలో ఆగ్రహం పట్టలేకపోయిన అత్త గీతా లాయెక్ గొడ్డలి తీసుకుని కోడలు భవానీ లాయెక్‌పై దాడికి పాల్పడింది. అయితే, గొడ్డలి తలపై బలంగా తగలడంతో భవానీ లాయెక్ అక్కడికక్కడే పడిపోయింది. 
 
ఇరుగుపొరుగు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భవానీ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గొడవ జరిగినప్పుడు తాను విధులకు వెళ్లినట్లు అతను తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments