అత్త క్షణికావేశం.. కోడలి నిండు ప్రాణాలు బలి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (18:23 IST)
అత్తాకోడళ్ల గొడవ యుగాలు గడిచినా మారేలా లేదు. తాజాగా ఓ అత్త క్షణికావేశం ఓ కోడలి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలోని సెరాయ్‌కేలా-ఖాస్వాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఝావ్రీ గ్రామానికి చెందిన భవానీ లాయెక్ (22), ఆమె అత్త గీతా లాయెక్ మధ్య ఆదివారం మధ్యాహ్నం గొడవ జరిగింది. ఇద్దరిమధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. 
 
ఈ క్రమంలో ఆగ్రహం పట్టలేకపోయిన అత్త గీతా లాయెక్ గొడ్డలి తీసుకుని కోడలు భవానీ లాయెక్‌పై దాడికి పాల్పడింది. అయితే, గొడ్డలి తలపై బలంగా తగలడంతో భవానీ లాయెక్ అక్కడికక్కడే పడిపోయింది. 
 
ఇరుగుపొరుగు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భవానీ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గొడవ జరిగినప్పుడు తాను విధులకు వెళ్లినట్లు అతను తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments