Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్తికల్ని సముద్రంలో కలపబోయి.. కుమారుడు వెళ్లిన చోటికే..?

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (14:53 IST)
sea
కన్నబిడ్డ ప్రమాదంలో మరణించడంతో ఆ తల్లి కూడా కుమారుడు వెళ్లిన చోటికే వెళ్లిపోయింది. ప్రమాదంలో మరణించిన తనయుడి అస్తికల్ని సముద్రంలో కలిపేందుకు వెళ్లిన ఓ తల్లి మృతదేహంగా ఒడ్డుకు చేరింది. కోవళం బీచ్‌లో ఈ విషాద ఘటన ఆదివారం వెలుగు చూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. తాంబరం సమీపంలోని పెరుంగళత్తూరు గుండు మేడుకు చెందిన వసంతి (42). ఆమె కుమారుడు గోకులన్‌ (21) స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. గత నెల 22వ తేదీ మోటారు సైకిల్‌ ప్రమాదంలో గోకులన్‌ మరణించాడు. ఒక్కగానొక కుమారుడు దూరం కావడంతో వసంతి ఒంటరి అయ్యారు. అతడి అస్తికల్ని ఇంట్లో ఫొటో వద్ద ఉంచి ప్రతి రోజూ పూజ చేస్తూ వచ్చారు. 
 
తీవ్ర శోకంతో ఆమె ఉండటమే కాకుండా, అస్తికల్ని ఇంట్లోనే ఉంచుకోవడాన్ని బంధువులు ఖండించారు. అస్తికల్ని సముద్రంలో కలిపేయాలని సూచించారు. దీంతో ఆమె శనివారం అస్తికల్ని సముద్రంలో కలిపేందుకు కోవళం బీచ్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి చేరకపోవడంతో జాడ కోసం బంధువులు గాలించారు. పోలీసులకు సమాచారం అందించారు.
 
ఆమె ఫోన్‌ రింగ్‌ అవుతున్నా, ఎవ్వరూ తీయ లేదు. ఎట్టకేలకు ఓ వ్యక్తి ఆ ఫోన్‌ను అందుకుని బీచ్‌లో పడి ఉన్నట్లుగా సమాచారం ఇచ్చాడు. కోవళం బీచ్‌కు వెళ్లి అక్కడి జాలర్ల వద్ద విచారించగా, ఓ మహిళ గంటల తరబడి సముద్రం ఒడ్డున అస్తికలతో ఓ చోట కూర్చుని తీవ్రంగా ఏడుస్తున్నట్లుగా తెలిపారు. 
 
కదిలించినా ఆమె మాట్లాడక పోవడంతో పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈక్రమంలోనే ఆమె మృతదేహం ఒడ్డుకు చేరింది. తీవ్ర మనో వేదనతో ఉన్న వసంతి అస్తికల్ని సముద్రంలో కలిపి తర్వాత బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments