మాస్కో - గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (09:51 IST)
మాస్కో - గోవా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ విమానాశ్రయంలో కిందకు దించేశారు. ఆ తర్వాత ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి, బాంబు స్క్వాడ్‌తో విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 
 
మొత్తం 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో కలిపి మొత్తం 277 మందితో మాస్కో నుంచి గోవాకు ఓ విమానం వస్తుంది. ఈ విమానానికి ఉన్నట్టుండి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. విమాంలో బాంబు ఉన్నట్టు గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం వచ్చింది. దీంతో ఆ విమానాన్ని జామ్ నగర్ విమానాశ్రయానికి మంళ్లి అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. 
 
అప్పటికే సిద్ధంగా ఉన్న బాంబు డిస్పోజల్ సిబ్బంది ఆ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. పైగా, ఆ విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. విమానంలోని 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందిని గత రాత్రి 9.49 గంటల సమయంలో సురక్షితంగా ఖాళీ చేయించినట్టు జామ్ నగర్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ తెలిపారు. 
 
అయితే, విమానంలో రాత్రంతా తనిఖీ చేసిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనుమానాస్పద వస్తువేదీ కనిపించలేదని నిర్ధారించిందని తెలిపారు. ప్రతి ప్రయాణికుడి లగేజీని కూడా తనిఖీ చేసినట్టు జామ్ నగర్ ఎస్పీ వెల్లడించారు. ఈ బాంబు బెదిరింపు ఉత్తుత్తిదేనని తేలడంతో ప్రయాణికులతో విమానం తిరిగి గోవా వెళ్లేందుకు అనుమతి లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments