Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా 'నేషన్ మూడ్' : శరద్ పవార్

ఠాగూర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (09:51 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇపుడు దేశం మూడు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నేషన్ మూడ్ మారుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయని తెలిపారు. 
 
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై ఇంకా ఆలోచన చేయలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి లోక్‌సభ స్థానాల పంపకాలపై ప్రశ్నించగా, తానేమీ జ్యోతిష్యుడిని కాదన్నారు. ప్రధాని మోడీ చిన్న చిన్న అంశాలపై దృష్టిసారిస్తున్నారని, కానీ, వేలాది చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే ఆయన మాత్రం మౌనంగా ఉండిపోతున్నారని వ్యాఖ్యానించారు. పైగా, ఇందిరా గాంధీ విమర్శలు గుప్పిస్తూ, జాతి ప్రయోజనాలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 
 
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఆయన స్పందిస్తూ, సంజయ్ సింగ్‌ను అరెస్టు చేసి అతడికి అన్యాయం చేశారని, ఇపుడు ఆయన విడుదల కావడం శుభపరిణామమన్నారు. ఆయన విడుదల కావడంతో ఇపుడు దేశం యావత్‌కు నిజం తెలుస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments