Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోబూచులాడుతున్న నైరుతి.. మరింత ఆలస్యం కావొచ్చంటున్న ఐఎండీ

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (14:50 IST)
దేశంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం మరింత ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సోమవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. 
 
వాస్తవానికి వర్షాలు గత కొన్ని రోజులుగా దూబూచులాడుతున్నాయి. అదేసమయంలో నైరుతి రుతుపవనాలు జూన్ నాలుగో తేదీ నాటికే కేరళ తీరాన్ని తాకుతాయని తొలుత అంచనా వేసింది. కానీ, ఈ అంచనాలు తారుమారయ్యాయి. జూన్ ఏడో తేదీ నాటికి రుతుపవనాలు కేరళను చేరుకుంటాయని తెలిపింది. ఆ తర్వాత అక్కడ నుంచి కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాయని వెల్లడించింది.
 
"దక్షిణ అరేబియా సముద్రంపై పశ్చిమాది గాలులు పెరుగుతుండటంతో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. పడమర గాలుల తీవ్ర ఆదివారం నుంచి మరింతగా పెరిగింది. సముద్ర ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తుకు జూన్ 4వ తేదీన చేరాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంపైనా మేఘాలు వ్యాప్తి పెరుగుతోంది. ఈ అనుకూల పరిస్థితులతో రుతుపవనాలు వచ్చే మూడు నాలుగు రోజుల్లో మరింత పురోగమిస్తాయి" అని తెలిపింది. 
 
కాగా, ఈ యేడాది ఎల్ నినో ప్రభావం ఉంటున్నప్పటికీ సాదారణ వర్షాలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ లోగడ ప్రకటించిన విషయం తెల్సిందే. గత 2022లో నైరుతి రుతుపవనాలు మే 29వ తేదీన కేరళ తీరాన్ని తాకగా, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న చేరుకున్నాయి. ఈ ప్రకారంగా ఈ యేడాది ఇప్పటికే ఆలస్యమైనట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments