Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోతులపై కేసు పెట్టండి.. అవేం చేశాయో తెలుసా?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (15:25 IST)
కోతులు మనుషులపై పడితే కరవడం, లేదా రక్కుతాయి. అయితే యూపీలోని కోతులు మాత్రం డిఫరెంట్‌గా రాళ్లతో మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ దాడిలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కోతులపై కేసు నమోదు చేయాలని మృతుడి బంధువులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని బాగ్‌పత్ జిల్లా టిక్రీ గ్రామానికి చెందిన ధర్మపాల్ సింగ్ (72) వంట చెరకు కోసం.. అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఆయన్ని గమనించిన కోతులు గుంపు రాళ్లతో ఒక్కసారిగా ఆయనపై దాడికి తెగబడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ధర్మపాల్ సింగ్ రక్తసిక్తమై ఇంటికి చేరుకున్నారు. 
 
దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ధర్మపాల్ సింగ్‌ను చంపిన కోతులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే తమ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments