Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకను హడలెత్తిస్తున్న మంకీఫీవర్...

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (08:53 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 61 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారినపడి సుమారుగా మూడు వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఈ కరోనా కేసులు భారతదేశంలో కూడా నమోదయ్యాయి. అయితే, అదృష్టవశాత్తూ ఏ ఒక్కరూ చనిపోలేదు. 
 
ఈ క్రమంలో భారత్‌లో మరో ప్రమాదకర వైరస్ తన ఉనికి చాటుకుంటోంది. మంకీ ఫీవర్ వైరస్‌గా పిలిచే ఈ మహమ్మారి కారణంగా కర్నాటకలో ఇప్పటివరకు ఇద్దరు మరణించారు. కర్నాటకలోని శివమొగ్గ ప్రాంతంలో 55 మంది మంకీ ఫీవర్ బారినపడినట్టు గుర్తించారు. 
 
వాస్తవానికి ఈ వ్యాధిని కైసనూరు ఫారెస్ట్ డిసీజ్‌గా వ్యవహరిస్తారు. దీనికే మంకీ ఫీవర్ అని మరో పేరుంది. మంకీ ఫీవర్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో ఆందోళన హెచ్చుతోంది. 
 
సిద్ధపుర తాలూకాకు చెందిన భాస్కర్ గణపతి హెగ్డే (64), మరో మహిళ మంకీ ఫీవర్ కారణంగా మరణించినట్టు అధికార వర్గాలంటున్నాయి. దీంతో కర్నాటక ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి ఈ మంకీ ఫీవర్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం