Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక ఇబ్బందులు.. పురుగుల మందు సేవించి టెక్కీ ఫ్యామిలీ...

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (08:03 IST)
హైదరాబాద్‌ నగరంలోని హస్తినాపురంలో దారుణం జరిగింది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలకు పురుగుల మందు తాగించి ఆపై వారు కూడా తాగి ప్రాణాలు తీసుకున్నారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రదీప్, స్వాతి అనే దంపతులు ఉన్నారు. ప్రదీప్ ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రదీప్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు.. కళ్యాణ్ ‌(6), జయకృష్ణ (2) ఉన్నారు. ప్రదీప్ కుటుంబం గత కొన్ని నెలలుగా కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ఆ ఒత్తిడి తట్టుకోలేని ప్రదీప్‌ దంపతులు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. 
 
తాము మరణిస్తే.. తమ కుమారులు అనాథలవుతారని భావించి, వారిని కూడా ఆత్మహత్యలో భాగం చేశారు. నలుగురు ఒకేసారి పురుగుల మందు తాగి, ఆత్మహత్య చేసుకున్నారు. విషయాన్ని గమనించిన ఇంటి యజమాని, విషయాన్ని స్థానికులకు, పోలీసులకు తెలియజేశారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పంచనామా నిర్వహించారు. అనంతరం, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం.. మార్చురీకి తరలించారు. ప్రదీప్‌ కుటుంబం ఆత్మహత్య విషయాన్ని వారి కుటుంబీలకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments