Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిజోరం ఎన్నికలు : మొదలైన పోలింగ్ - అధికారం ఎవరికో?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (09:03 IST)
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరం రాష్ట్ర శాసనసభకు పోలింగ్ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 40 సీట్లు ఉన్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఫలింతగా బుధవారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటింగ్ సాగుతోంది. పోటీలో మొత్తం 209 మంది అభ్యర్థులు ఉన్నారు. 
 
కాగా, మిజోరంలో మొత్తం 770395 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 394897 మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ పట్టుబడుతోంది. అదేసమయంలో వరుసగా మూడోసారి గెలిచి ప్రబుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఉత్సుకతతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఫలితంగా పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. 
 
మిజోరంలో 1987 నుంచి కాంగ్రెస్, మిజోరం నేషనల్ పార్టీలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి. దీంతో ఈ సారి అధికారాన్ని చేపట్టడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి బ్రూ తెగల ఓటు హక్కు గురించి రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగాయి. మిజోరానికి చెందిన బ్రూ తెగ వాళ్లు గతంలో త్రిపురకు వలస వెళ్లి అక్కడ ఉన్న తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకున్నారు. 
 
వీరి ఆందోళనల ఫలితంగా చివరికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ను తొలిగించి, ఆశిశ్ కుంద్రాను నియమించింది. బ్రూ తెగకు చెందిన వాళ్లకు మిజోరం సరిహద్దు జిల్లా మమిత్‌లోని కాన్మున్ గ్రామంలో 15 తాత్కాలిక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments