Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా జాబిల్లి ల్యాండర్ లూనా-25లో సాంకేతిక సమస్యలు

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2023 (09:42 IST)
చంద్రుడి దక్షిణ ధృవం అధ్యయనం కోసం ఉన్నట్టుండి రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో దాని భవితవ్యంపై నీలి నీడలు అలుముకున్నాయి. ఈ సమస్యను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ తెలిపింది. 
 
ప్రస్తుతం ఆ వ్యోమనౌక చందమామ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ల్యాండింగ్‌కు ముందు కక్ష్య (ప్రీ ల్యాండింగ్‌ ఆర్బిట్‌)కు చేరడానికి శనివారం లూనా-25 కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్‌ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో నిర్దేశిత పరామితులకు అనుగుణంగా సంబంధిత విన్యాసం సాగలేదని రోస్‌కాస్మోస్‌ తెలిపింది. 
 
ఈ పరిస్థితుల్లో దాని ల్యాండింగ్‌ వాయిదా పడుతుందా అన్నదానిపై ఆ సంస్థ స్పష్టత ఇవ్వలేదు. ఈ వ్యోమనౌక ఇప్పటికే చందమామకు సంబంధించిన ఫొటోలను అందించింది. లూనా-25ని ఈ నెల 11వ తేదీన రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి నింగిలోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే. 
 
దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లిపై ల్యాండింగ్‌కు రష్యా ప్రయత్నిస్తోంది. భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-3.. ఈ నెల 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రదేశంలో దిగనుంది. లూనా-25 కూడా అదే ప్రాంతంలోని బొగుస్లావ్‌స్కీ బిలానికి చేరువలో 1-2 రోజుల ముందు దిగాల్సి ఉంది. ఇంతలోనే దానిలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం