Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశువుల మేతకోసం వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య..

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (12:17 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. రాష్ట్రంలో జరిగిన హత్రాస్ ఘటన మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పశువులకు మేతకోసం వెళ్లిన మైనర్‌ బాలికపై దుండగులు లైంగిక దాడికి పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను హత్యచేశారు. రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్‌ జిల్లా పురెందర్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
ఈనెల 18న బాధితురాలి తల్లి పశువుల మేతకోసం అడవిలోకి వెళ్లింది. గడ్డిని ఇంటికి తీసుకువెళ్లడానికి సైకిల్‌ తీసుకుని రావాలని తన 12 ఏండ్ల కూతురికి చెప్పింది. దీంతో తల్లి వెళ్లిన కొద్దిసేపటికి ఆ బాలిక అడవిలోకి పయణమయ్యింది. అయితే ఆ బాలిక ఎంతసేపైనప్పటికీ తన వద్దకు రాకపోవడంతో.. ఆమె వెతకడం ప్రారంభించింది. అదే రోజు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత అటవీ ప్రాంతంలో ఆ బాలిక సైకిల్‌, చెప్పులు కనిపించాయి.
 
కాగా, బాలిక మృతదేహాన్ని గ్రామస్థులు మంగళవారం ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపించారు. తమ ఇంటికి 5 వందల మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఆ బాలిక రక్తపు మడుగులో పడి ఉన్నదని పోలీసులు తెలిపారు. 
 
బాలికపై సామూహిక లైంగిదాడికి పాల్పడిన దుండగులు, అనంతరం ఆమెను హత్యచేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని మహారాజ్‌గంజ్‌ సీనియర్‌ పోలీసు అధికారి ప్రదీప్‌ గుప్తా తెలిపారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం