నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం.. మద్దతిస్తామన్న అసదుద్ధీన్ ఓవైసీ

తెలుగు ప్రజలకు అన్యాయం చేశామనే సానుభూతి దేశంలోని రాజకీయ పార్టీలకుందని.. దీంతో మోదీపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి ఆ పార్టీల మద్దతు కూడా లభించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. కేంద్రం ప్రభు

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (12:38 IST)
తెలుగు ప్రజలకు అన్యాయం చేశామనే సానుభూతి దేశంలోని రాజకీయ పార్టీలకుందని.. దీంతో మోదీపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి ఆ పార్టీల మద్దతు కూడా లభించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. కేంద్రం ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాలకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తామని ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ స్పష్టం చేసారు. 
 
ప్రధానిపై, బీజేపీపై ఎప్పుడు గుర్రుగా వుండే ఓవైసీ అవిశ్వాసానికి సై అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాల్సిందేనని ఓవైసీ తెలిపారు. ముస్లిం మహిళలకు, మైనార్టీలకు మోదీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, యవతకు ఉద్యోగాలను కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయిందని ఓవైసీ తెలిపారు. దీంతో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు.
 
ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దక్షిణాది పట్ల బీజేపీ ఉత్తరాది నేతలు చులకన భావాన్ని చాటుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి వ్యాఖ్యలే నిదర్శనం.

పార్లమెంట్‌లో ఏం జరుగుతుందో, ఏ పార్టీ ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో చూద్దాం. ఏదైనా ఇది ఎన్నికల ఏడాది అని.. ఈ సమయంలో ప్రత్యేక హోదా డిమాండ్లు వస్తుంటాయన్నారు. దీనిని బట్టి ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదాను కూడా పరోక్షంగా ఎన్నికల ముందు డిమాండ్ల గాటలో నక్వి కట్టేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments