Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్లపై ఉగ్రవాదుల కన్ను

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (07:54 IST)
ఉగ్రవాదులు రైల్వే స్టేషన్లను టార్గెట్ చేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రైల్వే స్టేషన్లపై దాడులకు టెర్రరిస్టులు ప్రణాళిక రచించారని వార్నింగ్ ఇచ్చాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది.

దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతను పెంచారు. కీలకమైన రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. స్థానిక పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా సోదాలు చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల ను అదుపులోకి తీసుకున్నారు.

జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన మసూద్, అహ్మద్ పేరుతో రోహ్‌తక్ రైల్వే పోలీసులకు లేఖ వచ్చింది. అక్టోబర్ 8న రైల్వే స్టేషన్లలో దాడులు చేయబోతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు.

దాంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని స్టేషన్లలో అదనపు బలగాలను మోహరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం