Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరేబియా సముద్రంలో కూలిన మిగ్ 29 : పైలట్ల కోసం గాలింపు

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (10:11 IST)
అరేబియా సముద్రంలో మిగ్ 29 రకం శిక్షణ యుద్ధ విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది. గురువారం రాత్రి ఇద్దరు పైలెట్లతో వెళుతున్న ఈ మిగ్-29కే యుద్ధ విమానం ఉన్నట్టుండ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 
 
రోజువారీ శిక్షణలో భాగంగా దక్షిణ గోవాలోని ఐఎన్‌ఎస్‌ హన్సా నుంచి బయల్దేరిన మిగ్‌-29కే విమానం గురువారం సాయంత్రం 5 గంటలకు అరేబియా సముద్రంలో కూలిపోయిందని భారత నౌకాదళ అధికారి ఒకరు తెలిపారు. ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని వెల్లడించారు. 
 
కూలిపోయే ముందు ఇద్దరు పైలట్లూ బయట పడ్డారని, ఓ పైలట్ క్షేమంగా బయట పడ్డారని తెలుస్తోంది. మరో పైలట్ కోసం వెతుకులాట కొనసాగుతోందన్నారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయమై విచారణకు ఆదేశించామని తెలిపింది.
 
కనిపించకుండా పోయిన పైలట్ కోసం వాయుసేనతో పాటు సైన్యం సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని అన్నారు. ఈ యుద్ధ విమానం గోవా సమీపంలో మోహరించివున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి తన నిఘా కార్యకలాపాల నిమిత్తం పని చేస్తోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత రక్షణ శాఖ వద్ద 40 మిగ్-29కే ఫైటర్ జెట్స్ ఉన్నాయి. 
 
కాగా, ఈ యేడాది మిగ్‌-29కే విమానం కుప్పకూలడం ఇది మూడోసారి. గత ఫిబ్రవరిలో గోవా తీరంలో మిగ్‌-29 కే శిక్షణ విమానం ఉదయం 10.30 గంటలకు కూలిపోయింది. అయితే అందులో ఉన్న పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments