Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్వారియా యాత్రలో విషాదం.. విద్యుదాఘాతానికి శివభక్తుల మృతి

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (10:25 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కన్వారియా యాత్రలో పాల్గొన్న ఐదుగురు శివ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. హైటెన్షన్ విద్యుత్ తీగలు తలగడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన మీరట్ జిల్లాలో జరిగింది.
 
కాన్వార్ యాత్రలో పాల్గొన్న భక్తులు హరిద్వార్‌లో పవిత్ర గంగా జలాలను తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. భజనలు చేసుకుంటూ వస్తున్న వీరి వాహనం మీరట్ జిల్లాలోని భావన్‌పుర్‌లోని రాలీ చౌహాన్‌ గ్రామ సమీపానికి చేరగానే.. తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు తగిలింది.
 
దీంతో వాహనం సమీపంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు స్థానికులు.. పవర్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి విద్యుత్‌ సరఫరా నిలిపివేయాల్సిందిగా కోరే లోపే.. ప్రాణ నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురిని సమీప ఆస్పత్రులకు తరలిచారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments