Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ డే.. పాముకాటుతో 21 ఏళ్ల యువకుడి మృతి

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (15:28 IST)
త్రిసూర్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత పాము కాటుతో మరణించాడు. కర్ణాటకలోని తుమకూరులోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీ విద్యార్థి ఆదిత్ బాలకృష్ణన్ పాముకాటు గురై మృతి చెందాడు.
 
బెంగళూరుకు 80 కిలోమీటర్ల దూరంలోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో స్నాతకోత్సవానికి హాజరైన ఆయన తన నివాసానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పార్కింగ్‌లో బాలకృష్ణన్ పాము కాటుకు గురై వుంటాడని అనుమానిస్తున్నారు. అయితే పాము కాటుకు గురైందని గుర్తించకపోవడంతో తన నివాసానికి వెళ్లాడు. ఆదిత్ తల్లి, ఇతర బంధువులు కూడా స్నాతకోత్సవానికి హాజరయ్యారు. 
 
నివాసానికి చేరుకున్న ఆదిత్ బాత్‌రూమ్‌లోకి ప్రవేశించగా, తలుపు తెరవకపోవడంతో అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. ఆస్పత్రిలో పరీక్ష చేయగా కాలుపై పాము కాటు వేసిన గుర్తు కనిపించింది. 
 
పోస్ట్ మార్టం పరీక్షలో రక్తంలో పాము విషం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఎంపీ శశిథరూర్ ఆదిత్  స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments