Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో చూసిన బంధువులు, అంతే...

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (21:17 IST)
పెళ్ళయ్యింది. పిల్లలు లేరు. డబ్బులు సంపాదించడానికి భర్త విదేశాలకు వెళ్ళిపోయాడు. ఒంటరితనం. బాగా చదువుకోవడంతో ఉద్యోగంలోకి వెళ్ళింది. అక్కడే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే తన విషయాన్ని బయటకు రాకుండా ఎన్నోరోజులు జాగ్రత్తపడ్డ వివాహిత ఉన్నట్లుండి బయటపడటంతో ఆత్మహత్యకు పాల్పడింది.
 
కేరళ రాష్ట్రం అలపుజకు చెందిన సతీష్ అనే 28 యేళ్ళ వ్యక్తికి, సవిత అనే యువతికి రెండేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. విదేశాల్లో ఉద్యోగం దొరకడంతో తన ఇంటిలోనే సవితను వదిలి వెళ్ళాడు సతీష్. ఇంతవరకు ఇండియాకు రాలేదు. అయితే ఇంట్లో బోర్ కొడుతుందని ఒక సూపర్ మార్కెట్లో ఉద్యోగంలో చేరింది సవిత.
 
అక్కడే మేనేజర్‌గా విధులను నిర్వర్తిస్తోంది. మరో మేనేజర్ ప్రవీణ్ కూడా సవితతో పాటు కొత్తగా ఉద్యోగంలో చేరాడు. మేనేజర్లు కావడంతో ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. డ్యూటీకి వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉండే వీళ్ళు డ్యూటీ అయిపోయిన తరువాత భార్యాభర్తల్లాగా బయట తిరుగుతూ తెగ ఎంజాయ్ చేసేవారు. తన ఇంట్లో వారికి తెలియకుండా జాగ్రత్తగా పడింది సవిత. 
 
అయితే రెండురోజుల క్రితం ఆదివారం కావడంతో ప్రియుడిని కలుసుకునేందుకు బయటకు వచ్చింది. సాయంత్రం వరకు ప్రియుడితో తిరిగి ఆ తరువాత ఇంటికి రావడానికి సిద్ధమైంది. అయితే సతీష్ బంధువులు సవితను ప్రవీణ్‌తో చూశారు. ఈ విషయాన్ని గమనించిన సవిత ఆందోళనకు గురైంది. 
 
తన భర్తకు విషయం ఎక్కడ తెలిసిపోతుందన్న భయంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమేంటో కూడా లేఖలో రాసింది. తన భర్తకు క్షమాపణ చెబుతూ లేఖలో కూడా రాసింది సవిత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments