పిల్లలు పుట్టలేదని కోడల్ని పొట్టనబెట్టుకున్నారు.. హత్య చేసి కాల్చేయాలనుకున్నారు..

సెల్వి
బుధవారం, 17 సెప్టెంబరు 2025 (16:43 IST)
Woman
సంతానం కలగలేదని రాజస్థాన్‌లో ఓ కోడలిని చంపేశారు. పిల్లలు పుట్టలేదని కోడలిని హత్య చేశారు.. ఆమె అత్తమామలు. తర్వాత ఆమె మృతజదేహాన్ని కాల్చేశారు. కానీ ఇంతలో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. వివరాల్లోకి వెళితే.. 2005లో కాక్రా గ్రామానికి చెందిన అశోక్‌తో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు పిల్లలు లేరు. 
 
సరళ గర్భం దాల్చలేదని అశోక్ తరచుగా వేధించేవాడు. అత్తమామలు కూడా ఇదే విధంగా సరళను వేధించేవారు. విడాకులు ఇచ్చి అశోక్‌కు రెండో వివాహం చేయాలని సరళ అత్తమామలు భావించారు. కానీ సరళ విడాకులు ఇచ్చేందుకు నిరాకరించింది. అంతే ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్న సరళ అత్తమామలు ఆమెను హతమార్చి .. కాల్చేయాలనుకున్నారు. 
 
అగ్నిప్రమాదం జరిగిందని చిత్రీకరించాలని చూశారు. అయితే గ్రామస్తులకు అనుమానం వచ్చి దహన సంస్కారాలు చేపట్టే ముందు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, దహన సంస్కారాలు జరగకముందే పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని, సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త, అత్తమామలపై హత్య కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments