Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బీజేపీ ఎమ్మెల్యేలు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 14 మే 2019 (09:15 IST)
దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెల్లడికానున్నాయి. ఈ ఫలితాల కోసం దేశ ప్రజలేకాకుండా, ప్రపంచం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే, ఈ ఫలితాల తర్వాత పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం కర్ణాటక రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. 
 
ఈ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఈ సర్కారును కూలదోసి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కమలనాథులు శతవిధాలా ప్రయత్నించారు. కానీ, సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలతో వారి ఫలితాలు ఫలించలేదు. అయినప్పటికీ బీజేపీ నేతలు తమ వక్రబుద్ధిని వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతూనే ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి వేణుగోపాల్ స్పందిస్తూ, సరిగ్గా యేడాది క్రితం కర్ణాటకలో తాము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామని, ఐదేళ్లపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనసాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. 
 
బీజేపీ నుంచి తాము ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం లేదని అయితే ఈ నెల 23వ తేదీన ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆయన చెప్పారు. అదేసమయంలో కాంగ్రెస్ - జేడీఎస్‌ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments