Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బీజేపీ ఎమ్మెల్యేలు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 14 మే 2019 (09:15 IST)
దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెల్లడికానున్నాయి. ఈ ఫలితాల కోసం దేశ ప్రజలేకాకుండా, ప్రపంచం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే, ఈ ఫలితాల తర్వాత పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం కర్ణాటక రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. 
 
ఈ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఈ సర్కారును కూలదోసి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కమలనాథులు శతవిధాలా ప్రయత్నించారు. కానీ, సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలతో వారి ఫలితాలు ఫలించలేదు. అయినప్పటికీ బీజేపీ నేతలు తమ వక్రబుద్ధిని వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతూనే ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి వేణుగోపాల్ స్పందిస్తూ, సరిగ్గా యేడాది క్రితం కర్ణాటకలో తాము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామని, ఐదేళ్లపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనసాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. 
 
బీజేపీ నుంచి తాము ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం లేదని అయితే ఈ నెల 23వ తేదీన ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆయన చెప్పారు. అదేసమయంలో కాంగ్రెస్ - జేడీఎస్‌ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments