Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్ తగలబడిపోతుంటే ప్రధాని మోడీ జోకులు వేశారు : రాహుల్ ధ్వజం

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (16:32 IST)
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లతో ఆ రాష్ట్రం మండిపోతుంటే ప్రధాని నరేంద్ర మోడీ జోకులు వేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఓవైపు నెలల తరబడి ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అల్లర్లతో మండుతుంటే.. ప్రధాని మాత్రం నవ్వుతూ, జోకులు వేశారని దుయ్యబట్టారు. ఆయన మాట్లాడిన తీరు తీవ్ర విచారకరమన్నారు.
 
'ప్రధాని మోడీ గురువారం లోక్‌సభలో 2 గంటల 13 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. కానీ, మణిపూర్‌ గురించి కేవలం 2 నిమిషాలు మాత్రమే ప్రస్తావించారు. ఓవైపు అల్లర్లు, అత్యాచారాలు, హత్యలతో మణిపూర్‌ అట్టుడుకుతుంటే.. ప్రధాని పార్లమెంట్‌లో నవ్వుతూ, జోకులు వేస్తున్నారు. గతంలో ఎందరో ప్రధానులను చూశాను. కానీ, ఇలా స్థాయి దిగజారి మాట్లాడిన ప్రధానిని నేను చూడలేదు. ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తి రాజకీయ నాయకుడిగా మాట్లాడకూడదు. ఆయన దేశ ప్రజలందరి ప్రతినిధి' అని రాహుల్ ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments