మణిపూర్ తగలబడిపోతుంటే ప్రధాని మోడీ జోకులు వేశారు : రాహుల్ ధ్వజం

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (16:32 IST)
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లతో ఆ రాష్ట్రం మండిపోతుంటే ప్రధాని నరేంద్ర మోడీ జోకులు వేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఓవైపు నెలల తరబడి ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అల్లర్లతో మండుతుంటే.. ప్రధాని మాత్రం నవ్వుతూ, జోకులు వేశారని దుయ్యబట్టారు. ఆయన మాట్లాడిన తీరు తీవ్ర విచారకరమన్నారు.
 
'ప్రధాని మోడీ గురువారం లోక్‌సభలో 2 గంటల 13 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. కానీ, మణిపూర్‌ గురించి కేవలం 2 నిమిషాలు మాత్రమే ప్రస్తావించారు. ఓవైపు అల్లర్లు, అత్యాచారాలు, హత్యలతో మణిపూర్‌ అట్టుడుకుతుంటే.. ప్రధాని పార్లమెంట్‌లో నవ్వుతూ, జోకులు వేస్తున్నారు. గతంలో ఎందరో ప్రధానులను చూశాను. కానీ, ఇలా స్థాయి దిగజారి మాట్లాడిన ప్రధానిని నేను చూడలేదు. ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తి రాజకీయ నాయకుడిగా మాట్లాడకూడదు. ఆయన దేశ ప్రజలందరి ప్రతినిధి' అని రాహుల్ ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments