Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో ఘోరం... బస్సు బోల్తా 15 మంది విద్యార్థుల మృతి

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (18:05 IST)
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. స్టడీ టూర్‌కు వెళ్లిన విద్యార్థు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ఘటనతో ఆ ప్రదేశంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశాయి. చనిపోయిన వారంతా అమ్మాయిలే కావడం గమనార్హం. మణిపూర్ రాష్ట్రంలోని నోనె జిల్లా లంగ్సాయి తుబంగ్ శివారులో ఈ ప్రమాదం జరిగింది. స్టడీ టూర్ కోసం ఇంఫాల్ నుంచి ఈ బస్సు బయలుదేరి లంగ్సాయి తుబంగ్ వద్ద బోల్తాపడింది. 
 
ఈ విద్యార్థులంతా యారిపోక్‌లోని తంబాల్ను హైయ్యర్ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థులు. ఎడ్యుకేషన్ టూర్ నిమిత్తం రెండు బస్సుల్లో ఖౌపుమ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై మణిపూర్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments