Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి మేనకా వరుణ్ గాంధీ అవుట్

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (15:32 IST)
భారతీయ జనతాపార్టీ నాయకులు మేనకా గాంధీ, వరుణ్ గాంధీ బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. బీజేపీ సీనియర్ నాయకురాలు, వరుణ్ తల్లి మేనకా గాంధీ కొడుకుతో పాటు జాతీయ కార్యవర్గం నుంచి తొలగించింది బీజేపీ.
 
వరుణ్ గాంధీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్న నేపధ్యంలోనే ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది హైకమాండ్. లఖింపూర్ ఖేరీ హింస కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటన చేసిన వరుణ్ గాంధీ, ఈమేరకు వస్తున్న వీడియోలను కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తున్నారు.
 
ఈరోజు(7 అక్టోబర్ 2021) కొత్త వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత వరుణ్ గాంధీ ట్వీట్ చేసి.. నిరసన వ్యక్తం చేసినవారిని చంపడం, అమాయక రైతుల రక్తం చిందించడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రభుత్వం అహంకారం పక్కనబెట్టి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
 
ఈ క్రమంలోనే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గాంలో చోటుదక్కలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ నాయకులు ఎల్‌కే అద్వానీ మరియు మురళీ మనోహర్ జోషి సహా మొత్తం 80 మంది నాయకులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments