బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి మేనకా వరుణ్ గాంధీ అవుట్

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (15:32 IST)
భారతీయ జనతాపార్టీ నాయకులు మేనకా గాంధీ, వరుణ్ గాంధీ బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. బీజేపీ సీనియర్ నాయకురాలు, వరుణ్ తల్లి మేనకా గాంధీ కొడుకుతో పాటు జాతీయ కార్యవర్గం నుంచి తొలగించింది బీజేపీ.
 
వరుణ్ గాంధీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్న నేపధ్యంలోనే ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది హైకమాండ్. లఖింపూర్ ఖేరీ హింస కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటన చేసిన వరుణ్ గాంధీ, ఈమేరకు వస్తున్న వీడియోలను కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తున్నారు.
 
ఈరోజు(7 అక్టోబర్ 2021) కొత్త వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత వరుణ్ గాంధీ ట్వీట్ చేసి.. నిరసన వ్యక్తం చేసినవారిని చంపడం, అమాయక రైతుల రక్తం చిందించడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రభుత్వం అహంకారం పక్కనబెట్టి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
 
ఈ క్రమంలోనే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గాంలో చోటుదక్కలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ నాయకులు ఎల్‌కే అద్వానీ మరియు మురళీ మనోహర్ జోషి సహా మొత్తం 80 మంది నాయకులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments