Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి బావిలో దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైంది?

ఠాగూర్
ఆదివారం, 30 మార్చి 2025 (10:22 IST)
వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి నేలబావిలో దూకేశాడు. ఆ బావికి మెట్లు లేకపోవడంతో పాటు అది నిర్మానుష్య ప్రాంతంలో ఉండటంతో మూడు రోజులు పాటు అందులోనే ఉండిపోయాడు. చివరకు ఆడుకునేందుకు ఆ బావి వద్దకు వచ్చిన కొందరు పిల్లలు ఆ వ్యక్తిని గుర్తించి గ్రామస్థులు, పోలీసుల సాయంతో రక్షించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
32 యేళ్ల సందీప్ శర్మ అనే వ్యక్తి పిశోర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే, బంధువుల గ్రామానికి చేరుకోగానే అతడిని కుక్కలు వెంబడించాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో భయంతో పరుగులు తీసిన సందీప్ నిర్మానుష్యంగా ఉన్న నేల బావిలో దూకేశాడు. లోతైన ఆ బావినుంచి ఎంత అరిచినా అతడి కేకలు ఎవరికీ వినిపించలేదు. 
 
దీంతో మూడు రోజుల పాటు అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఆ బావి వద్దకు వెల్లారు. ఆ సమయంలో సందీప్ వారికి కనిపించాడు. దాంతో వెంటనే వెళ్లి గ్రామస్థులకు విషయం చెప్పారు. వారు పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పొడవాటి తాడుకు ఓ టైరు కట్టి బావిలోకి వదిలారు. దాని సాయంతో సందీప్‌‍ను బయటకు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments