బంగారంతో పోటీపడుతున్న వెండి - రోజురోజుకూ పెరుగుతున్న ధరలు!!

ఠాగూర్
ఆదివారం, 30 మార్చి 2025 (10:04 IST)
బంగారం ధరలతో వెండి ధరలు పోటీపడుతున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ కారణంగా దేశీయంగా రికార్డు స్థాయి గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.92,150లకు చేరుకుంది. అదేసమయంలో బంగారం ధర రూ.92 వేలకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
ఇదే సమయంలో వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగి ప్రజలను షాక్‌కు గురిచేస్తున్నాయి. కిలో వెండి ధర రూ.1.03 లక్షలకు చేరుకుంది. గత యేడాదిలో బంగారం, వెండి ధరలు 37 శాతం మేరకు పెరగగా, గత నెలలో బంగారం ధర 6.70 శాతం, వెండి ధర రూ.8.80 శాతం మేరకు పెగిగాయి. 
 
2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బంగారం 31.37 శాతం రాబడిని ఇవ్వగా వెండి మాత్రం దానికంటే అధికంగా 35.56 శాతం రాబడిని అందిచింది. బంగారం, వెండి పెట్టుబడిదారులకు అధిక లాభాలను అందిస్తుండటం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. బంగారం కంటే వెండి ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో వెండి ధరలు రూ.1.25 లక్షలు దాటే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments