Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైలు అద్దం ఎందుకు పగులగొట్టాడంటే... (Video)

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (10:58 IST)
సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఓ యువకుడు సుత్తితో వందే భారత్ రైలు కిటికీ అద్దాన్ని పగులగొడుతుండటం ఆ వీడియోలో కనిపించింది. అయితే, ఆ యువకుడు ఎందుకు వందే భారత్ అద్దాన్ని పగులగొడుతున్నాడంటూ సోషల్ మీడియాలో వేదికగా అనేక మంది నెటిజన్లు ప్రశ్నిస్తూ కామెంట్స్ చేశారు. 
 
దీనిపై రకరకాలైన సమాధానాలు, అభిప్రాయాలు వెల్లడయ్యాయి. కొందరైతే ఈ పనికి పాల్పడిన ఆ యువకుడిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇంతకీ అద్దాన్ని పగులగొడుతున్న యువకుడు ఎవడు, అద్దం పగులగొట్టడానికి కారణం ఏంటి, అది ఏ స్టేషన్, ఆ వందే భారత్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. 
 
వీటికి ఇపుడు సమాధానం లభించింది. ఆ వందే భారత్ రైలు ఆగివున్నది ఓ రైల్వే స్టేషన్ కాదు. ఓ ట్రైన్ కోచ్ కేర్ సెంటర్ అని తేలింది. ఆ యువకుడు ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేసే ఉద్యోగి. వందే భారత్ రైలుకు పాడైపోయిన అద్దాన్ని తొలగించి, దాని స్థానంలో కొత్త అద్దం బిగించేందుకు పాత అద్దాన్ని ఆ విధంగా సుత్తితో కొట్టి తొలగిస్తున్నాడని తెలిసింది. ఏది ఏమైనా ఈ వీడియోకు మాత్రం లైకులు, షేర్లు ఓ రేంజ్‌లో వచ్చాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments