Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైలు అద్దం ఎందుకు పగులగొట్టాడంటే... (Video)

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (10:58 IST)
సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఓ యువకుడు సుత్తితో వందే భారత్ రైలు కిటికీ అద్దాన్ని పగులగొడుతుండటం ఆ వీడియోలో కనిపించింది. అయితే, ఆ యువకుడు ఎందుకు వందే భారత్ అద్దాన్ని పగులగొడుతున్నాడంటూ సోషల్ మీడియాలో వేదికగా అనేక మంది నెటిజన్లు ప్రశ్నిస్తూ కామెంట్స్ చేశారు. 
 
దీనిపై రకరకాలైన సమాధానాలు, అభిప్రాయాలు వెల్లడయ్యాయి. కొందరైతే ఈ పనికి పాల్పడిన ఆ యువకుడిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇంతకీ అద్దాన్ని పగులగొడుతున్న యువకుడు ఎవడు, అద్దం పగులగొట్టడానికి కారణం ఏంటి, అది ఏ స్టేషన్, ఆ వందే భారత్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. 
 
వీటికి ఇపుడు సమాధానం లభించింది. ఆ వందే భారత్ రైలు ఆగివున్నది ఓ రైల్వే స్టేషన్ కాదు. ఓ ట్రైన్ కోచ్ కేర్ సెంటర్ అని తేలింది. ఆ యువకుడు ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేసే ఉద్యోగి. వందే భారత్ రైలుకు పాడైపోయిన అద్దాన్ని తొలగించి, దాని స్థానంలో కొత్త అద్దం బిగించేందుకు పాత అద్దాన్ని ఆ విధంగా సుత్తితో కొట్టి తొలగిస్తున్నాడని తెలిసింది. ఏది ఏమైనా ఈ వీడియోకు మాత్రం లైకులు, షేర్లు ఓ రేంజ్‌లో వచ్చాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments