Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలిసి బతుకుదామని నమ్మించి కోర్టు హాలులోనే భార్య గొంతుకోసిన భర్త

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (13:54 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కలిసి జీవిద్దామని భార్యను నమ్మించి కోర్టుకు తీసుకొచ్చిన ఓ కసాయి భర్త... కోర్టు హాలులోనే భార్య గొంతు కోశాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని హలెనరసిపుర ఫ్యామిలీ కోర్టులో జరిగింది. పైగా, ఈ భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులు కావడం గమనార్హం. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని హాసన్ జిల్లాకు చెందిన శివకుమార్, చైత్ర అనే మహిళకు ఏడేళ్ళ క్రితం వివాహమైంది. అయితే, వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. 
 
ఈ క్రమంలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, వారికి కౌన్సెలింగ్ ఇచ్చింది. విభేదాలు పరిష్కరించుకుని, కలిసి జీవించాల్సిందిగా సూచించారు. కౌన్సెలింగ్ సెషన్‌లో చెప్పిన ప్రతి మాటకు సమ్మతించారు. 
 
కౌన్సెలింగ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చైత్ర బాత్రూమ్‌కు వెళుతుండగా, శివకుమార్ ఆమెపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో పడిపోగానే పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, కోర్టులో ఉన్న ఇతరులు శివకుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అలాగే, రక్తపుమడుగులో ప్రాణాపాయస్థితిలో ఉన్న చైత్రను ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments