Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ళ బాలికపై అత్యాచారం... 17 రోజుల్లోనే జైలుశిక్ష

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (10:38 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో నాలుగేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడుకి కేవలం 17 రోజుల్లోనే జైలుశిక్ష పడింది. ఈ మేరకు పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని చురు ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
గత నెల 30వ తేదీన దయారాం మేఘ్వాల్ అనే వ్యక్తి సమీపంలో నివసించే నాలుగేళ్ళ చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అత్యాచారం జరిగిన మరుసటి రోజే నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
ఈ కేసు విచారణ కోసం పోక్సో చట్టం కింద ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణ రోజువారీగా సాగగా, ఈ నెల 7వ తేదీన చార్జిషీటును దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఏడు రోజుల్లోనే పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయగా, కోర్టు 17 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి శిక్ష విధించడం గమనార్హం. పోక్సో చట్టం కింద ఇంత స్వల్ప సమయంలో నిందితుడికి శిక్ష పడడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments