రూ.38 కోట్ల కరెంట్ బిల్లు చూసి.. అతనికి ఫ్యూస్ పోయింది..

నిన్నటికి నిన్న ఎయిర్‌టెల్ సంస్థ సాంకేతిక లోపాల కారణంగా లక్షల్లో రోమింగ్ ఛార్జీలతో కూడిన బిల్లును ఓ కస్టమర్‌కు పంపి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో రూ.38 కోట్ల కరెంట్ బిల

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (15:50 IST)
నిన్నటికి నిన్న ఎయిర్‌టెల్ సంస్థ సాంకేతిక లోపాల కారణంగా లక్షల్లో రోమింగ్ ఛార్జీలతో కూడిన బిల్లును ఓ కస్టమర్‌కు పంపి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో రూ.38 కోట్ల కరెంట్ బిల్లు చూసి ఓ వ్యక్తి ఫ్యూస్ పోయింది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌కు చెందిన జంషెడ్‌పూర్‌కు చెందిన గుహ అనే వ్యక్తికి విద్యుత్ బిల్లు షాక్ ఇచ్చింది. 
 
విద్యుత్ శాఖ ఇచ్చిన బిల్లులో రూ.38కోట్లు కట్టాల్సిందిగా ప్రింట్ అయ్యింది. పైగా ఈ బిల్లును చెల్లించలేదని.. విద్యుత్ అధికారులు గుహ ఇంటికి విద్యుత్ సరఫరాను ఆపివేశారు. మూడు గదులతో కూడిన తన ఇంటికి ఇంత మొత్తంలో కరెంట్ బిల్లు వచ్చే అవకాశం లేదని గుహ ఎంత చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. మూడు ఫ్యాన్లు, మూడు ట్యూబ్లెట్స్, టీవీని ఉపయోగిస్తున్నామని గుహ చెప్పుకొచ్చాడు. 
 
ఇంత మొత్తంలో బిల్లు ఎలా వస్తుందనే విషయాన్ని పట్టించుకోకుండా విద్యుత్ సరఫరాను కట్ చేయడం ఎంతవరకు సమంజసమని గుహ ప్రశ్నిస్తున్నాడు. అంతేగాకుండా దీనిపై విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా కేసు పెట్టాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments