Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేదని హత్య... 14 కత్తిపోట్లు.. పొట్టంతా ఛిద్రమైపోయింది..

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (15:23 IST)
ఓ యువతి ప్రేమించలేదని ఓ ఉన్మాది దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, తిరుచ్చిలోని అతికుళంకు చెందిన కేశవన్ అనే 22 ఏళ్ళ యువకుడు, ఇంటర్ చదివే యువతిని ప్రేమించాడు. 
 
గత రెండెళ్లుగా ప్రేమించమని వెంటపడుతున్నాడు.  కానీ ఆ యువతి అతడి ప్రేమను నిరాకరించింది. అతని వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, కేశవన్ ను అరెస్టు చేశారు. అయితే, నిందితుడు ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. మరల యువతి కోసం వెతికాడు.
 
యువతి కాలేజ్ నుంచి బయటకు వస్తుండగా తన ప్రేమను రిజెక్ట్ చేసినందుకు ఆమెతో వాగ్వాదానికి వెళ్లాడు. అందరు చూస్తుండగానే నడిరోడ్డు మీద కత్తితో విచక్షణ రహితంగా దాడిచేశాడు. 
 
యువతి రక్తపు మడుగులోన రోడ్డుమీద కుప్పకూలిపడిపోయింది. ఆ తర్వాత స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాలికను చూసిన వైద్యులు దాదాపు.. 14 కత్తిపోట్లకు గురైందని తెలిపారు. ఆమె పొట్టంతా కత్తిగాట్లతో ఛిద్రమైపోయింది. ప్రస్తుతం బాలిక చనిపోయింది. ఆ తర్వాత నిందితుడు కేశవన్ అక్కడే రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments