Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేదని హత్య... 14 కత్తిపోట్లు.. పొట్టంతా ఛిద్రమైపోయింది..

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (15:23 IST)
ఓ యువతి ప్రేమించలేదని ఓ ఉన్మాది దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, తిరుచ్చిలోని అతికుళంకు చెందిన కేశవన్ అనే 22 ఏళ్ళ యువకుడు, ఇంటర్ చదివే యువతిని ప్రేమించాడు. 
 
గత రెండెళ్లుగా ప్రేమించమని వెంటపడుతున్నాడు.  కానీ ఆ యువతి అతడి ప్రేమను నిరాకరించింది. అతని వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, కేశవన్ ను అరెస్టు చేశారు. అయితే, నిందితుడు ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. మరల యువతి కోసం వెతికాడు.
 
యువతి కాలేజ్ నుంచి బయటకు వస్తుండగా తన ప్రేమను రిజెక్ట్ చేసినందుకు ఆమెతో వాగ్వాదానికి వెళ్లాడు. అందరు చూస్తుండగానే నడిరోడ్డు మీద కత్తితో విచక్షణ రహితంగా దాడిచేశాడు. 
 
యువతి రక్తపు మడుగులోన రోడ్డుమీద కుప్పకూలిపడిపోయింది. ఆ తర్వాత స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాలికను చూసిన వైద్యులు దాదాపు.. 14 కత్తిపోట్లకు గురైందని తెలిపారు. ఆమె పొట్టంతా కత్తిగాట్లతో ఛిద్రమైపోయింది. ప్రస్తుతం బాలిక చనిపోయింది. ఆ తర్వాత నిందితుడు కేశవన్ అక్కడే రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments