Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని దూరం చేశారు.. కాళ్లు పట్టిచ్చి అవమానం చేశారు.. ఆత్మహత్య చేసుకున్నాడు..

ప్రేమించాడు.. ప్రియురాలి కుటుంబ సభ్యుల వద్దకెళ్ళి పిల్లనివ్వమని చెప్పారు. అంతటితో ఆగకుండా ప్రియురాలి కుటుంబ సభ్యులచే అవమానానికి గురయ్యాడు. దీంతో పాటు ప్రియురాలిని తన నుంచి దూరం చేశారని ఆవేదన, మనస్తాపం

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (12:02 IST)
ప్రేమించాడు.. ప్రియురాలి కుటుంబ సభ్యుల వద్దకెళ్ళి పిల్లనివ్వమని చెప్పారు. అంతటితో ఆగకుండా ప్రియురాలి కుటుంబ సభ్యులచే అవమానానికి గురయ్యాడు. దీంతో పాటు ప్రియురాలిని తన నుంచి దూరం చేశారని ఆవేదన, మనస్తాపంతో ఓ ప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన న్యూఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఢిల్లీలోని నిహాల్ విహార్‌కు చెందిన 25 ఏళ్ల యాగ్యా శరణ్ దత్‌కు స్థానికంగా నివాసముంటున్న ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం సాగుతోంది. 
 
ప్రేమికులిద్దరూ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో లంచ్ కు వెళ్లడం అమ్మాయి బంధువులు చూసి వారిని పోలీసుస్టేషనుకు తీసుకువెళ్లారు. యాగ్యా మేనమామతోపాటు అమ్మాయి తల్లిదండ్రులను పోలీసుస్టేషనుకు పిలిపించారు. పోలీసుస్టేషనులో ప్రియురాలి కాళ్లు పట్టిచ్చి అవమానించడమే కాకుండా ఇకముందు ఆమెను సోదరిగా చూడాలని అమ్మాయి కుటుంబసభ్యులు హుకుం జారీ చేశారు. దీంతో అవమానానికి గురైన మనస్తాపంతో యాగ్యా శరణ్ దత్ ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments