కరెంట్ బిల్లు కట్టమన్నారనీ రూమ్మేట్స్‌ను చంపేసిన యువకుడు...

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (09:30 IST)
ఢిల్లీలో ఉపాధి చేసుకుంటూ జీవిస్తూ వచ్చిన ఓ యువకుడు కరోనా లాక్డౌన్ కారణంగా సొంతూరికి వెళ్లిపోయాడు. నాలుగు నెలల తర్వాత మళ్లీ ఢిల్లీలోని తన రూమ్మేట్స్ గదికి వచ్చాడు. అతను వచ్చీరాగానే, మిగిలిన ఇద్దరు స్నేహితులు కరెంట్ బిల్లు, అద్దె కట్టమని ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహించిన ఆ యువకుడు... ఇద్దరు రూమ్మేట్స్‌ను పొడిచి చంపేసి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఈ ఘటన వెస్ట్ న్యూఢిల్లీలోని రఘుబీర్ నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహ్ గ్రామానికి చెందిన సాకీర్ (23) అనే వ్యక్తి వెస్ట్ ఢిల్లీలోని రఘుబీర్ నగర్‌లో మరో ఇద్దరు వలస కూలీలైన అజాం(45), అమీర్ హాసన్ (46)తో కలిసి ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఈ గదికి నెలకు రూ.4 వేలు అద్దె చెల్లిస్తూ వచ్చారు. 
 
అయితే, లాక్డౌన్‌ కారణంగా సాకీర్ తన స్వగ్రామానికి వెళ్లి, నాలుగు నెలల తర్వాత మంగళవారం రూమ్‌లో దిగాడు. దీంతో మిగిలిన ఇద్దరు రూమ్మేట్స్ ఆగ్రహించారు. అతను లేని నాలుగు నెలల అద్దె కూడా కట్టాలని పట్టుబట్టారు. దీంతో కొపం తెచ్చుకున్న నిందితుడు మిత్రులిద్దర్నీ పొడిచి చంపేసి, స్వగ్రామానికి వెళ్లిపోయాడు. 
 
దీనిపై ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ తర్వాత నిందితుడిని అరెస్టుచేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సాకీర్ సొంత గ్రామానికెళ్లి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments