Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యను కడతేర్చాడు..

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యనే కడతేర్చాడో కసాయి భర్త. ఈ ఘటన హిందూపురం పట్టణంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణం స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో ఉంటున్న బాలవినయ్‌కు బెంగళూరులోని మేనత్త కుమార్తె దీపిక(

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (13:24 IST)
ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యనే కడతేర్చాడో కసాయి భర్త. ఈ ఘటన హిందూపురం పట్టణంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణం స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో ఉంటున్న బాలవినయ్‌కు బెంగళూరులోని మేనత్త కుమార్తె దీపిక(31)తో పదేళ్ల కిందట వివాహమైంది. రెండేళ్లు కాపురం చేశాక విభేదాలు రావటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
ఆరేళ్ల కుమారుడు హరిచరణ్ ఆమె వద్దే వుంటున్నాడు. అనంతరం బాలవినయ్ మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య దీపిక తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని హిందూపురంలో కోర్టుకెక్కింది. ఈ నెల 27న విచారణ సందర్భంగా ఆమె హిందూపురానికి కుమారుడితోపాటు వచ్చింది. కేసు చివరిదశకు రావటం, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని తెలుసుకున్న బాలవినయ్‌ ఆమెను ఇంటికి పిలిపించుకొని దాడికి పాల్పడ్డాడు.
 
అనంతరం పోలేపల్లి వద్ద చంపి పొలాల్లో కాల్చేశాడు. హరిచరణ్‌ను బెంగళూరులోని అమ్మమ్మ వద్ద వదిలేసి వచ్చి.. భార్యను చంపేశాడు. ఈ ఘటనపై దీపిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులో వచ్చింది. బాలవినయ్ ప్రస్తుతం పరారీలో వున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments