Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమ్లెట్ దొంగిలించి తిన్నాడు.. అంతే.. చితక్కొట్టారు.. వ్యక్తి మృతి

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (17:48 IST)
బార్ నుంచి ఆమ్లెట్ దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. మృతికి సంబంధించిన సమాచారం అందుకున్న చెన్నై పోలీసులు అతడ మృతదేహాన్ని పుజల్ సరస్సు ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆమ్లెట్‌ను దొంగిలించి పారిపోయేందుకు ప్రయత్నిండంతో కొట్టడం వల్లనే చనిపోయినట్లు తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
 
బాధితుడిని వెంకటేశ్వర నగరానికి చెందిన అన్బలగన్‌గా పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా జరిగిన ఘర్షణను పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడు సదరు వ్యక్తి మెడపై కొట్టడంతో నేల మీద పడిపోయిన తరువాత దారుణంగా దాడి చేసినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తుంది. నిందితుడిని కృష్ణమూర్తి అనే వ్యక్తిగా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.  
 
కృష్ణమూర్తిని పోలీసులు ప్రశ్నించినప్పుడు, బార్ నుంచి ఆ వ్యక్తి ఆమ్లెట్ దొంగతనం చేసి తిన్నాడని చెప్పాడు. దొంగతనం చేసి ఆమ్లెట్‌ను తినడంపై ప్రశ్నించగా ఎదురు సమాధానం ఇచ్చాడని, దాంతో ఆ వ్యక్తి పై కోపం ఎక్కువై చితకబాదినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. హత్యలో పాల్గొన్న మరో వ్యక్తి అప్పూ కోసం పోలీసులు ఇప్పుడు వెతుకుతున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments