Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలిరాత్రికి తర్వాత కన్యత్వ పరీక్షల్లో విఫలం.. ఆ వధువును పుట్టింటికి పంపేశారు..!

Advertiesment
Woman
, శనివారం, 10 ఏప్రియల్ 2021 (11:52 IST)
కన్యత్వ పరీక్షల్లో విఫలమైన నవ వధువులిద్దరిని ఆ గ్రామ పెద్దలు పుట్టింటికి పంపారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొల్లాపూర్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు అదే గ్రామానికి చెందిన అన్నాతమ్ముళ్లతో నవంబర్‌ 27న పెళ్లి జరిపించారు. అయితే తొలిరాత్రికి తర్వాత ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కన్యత్వ పరీక్షను నిర్వహించారు. 
 
ఇందులో ఒకరు మాత్రమే ఉత్తీర్ణులు కాగా, మరొక వధువుకి ఎలాంటి రక్తస్రావం కాలేదు. దీంతో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను పుట్టింటికి పంపించేశారు. ఈ పెళ్లిని తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా, రూ. 10 లక్షల రూపాయలను ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు.
 
ఈ అంశంపై అమ్మాయి తల్లిదండ్రులు జాత్ పంచాయతీ వారిని సంప్రదించగా అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. కులంలోని కట్టబాట్ల ప్రకారం వర్జినిటీ పరీక్షలో యువతి విఫలమయిందని, దీంతో ఆమెకు ఇదివరకే ఎవరితోనో సంబంధం ఉందని పంచాయతీ పెద్దలు ఆరోపించారు. 
 
అంతేకాకుండా ఆ కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నామని తీర్పుచెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోకేష్‌కు కేసీఆర్‌ ఫోన్...ఎందుకో తెలుసా?