Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరి మృతిని జీర్ణించుకోలేని సోదరుడు.. చితిలో దూకేశాడు..

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (10:08 IST)
తనకు వరుసకు సోదరి కజిన్ సిస్టర్ మృతి చెందడాన్ని ఓ యువకుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆమె చితి మంటల్లో దూకి ప్రాణత్యాగం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, అదృష్టవశాత్తు అతన్ని ఇతరులు రక్షించగా, కాలిన గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భివారా జిల్లాలోని మణక్యా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మణక్యా గ్రామానికి చెందిన 25 యేళ్ల యువకుడు సుఖ్‌దేవ్ భిల్‌ కజిన్ సిస్టర్ చనిపోయింది. ఆమె అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. అయితే, ఆమె మృతిని జీర్ణించుకోలేని భిల్.. ఆమె చితి మంటల్లో దూకేశాడు. అతను మంటల్లో దూకగానే బంధువులు, ఇతర గ్రామస్తులు గుర్తించి రక్షించి, ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. అయితే, ఆ యువకుడు అలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. 
 
ఈ ఘటనపై భివారా అడిషినల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంచల్ మిశ్రా స్పందిస్తూ, భిల్ ఆస్పత్రిలో చేరినట్టు వైద్య వర్గాల నుంచి తమకు సమాచారం వచ్చిందని, ప్రస్తుతం అతను 95 శాతం గాయాలతో చికిత్స పొందుతున్నాడని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments