Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరి మృతిని జీర్ణించుకోలేని సోదరుడు.. చితిలో దూకేశాడు..

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (10:08 IST)
తనకు వరుసకు సోదరి కజిన్ సిస్టర్ మృతి చెందడాన్ని ఓ యువకుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆమె చితి మంటల్లో దూకి ప్రాణత్యాగం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, అదృష్టవశాత్తు అతన్ని ఇతరులు రక్షించగా, కాలిన గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భివారా జిల్లాలోని మణక్యా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మణక్యా గ్రామానికి చెందిన 25 యేళ్ల యువకుడు సుఖ్‌దేవ్ భిల్‌ కజిన్ సిస్టర్ చనిపోయింది. ఆమె అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. అయితే, ఆమె మృతిని జీర్ణించుకోలేని భిల్.. ఆమె చితి మంటల్లో దూకేశాడు. అతను మంటల్లో దూకగానే బంధువులు, ఇతర గ్రామస్తులు గుర్తించి రక్షించి, ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. అయితే, ఆ యువకుడు అలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. 
 
ఈ ఘటనపై భివారా అడిషినల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంచల్ మిశ్రా స్పందిస్తూ, భిల్ ఆస్పత్రిలో చేరినట్టు వైద్య వర్గాల నుంచి తమకు సమాచారం వచ్చిందని, ప్రస్తుతం అతను 95 శాతం గాయాలతో చికిత్స పొందుతున్నాడని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments