Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ ముద్రవేసి... సొంత ఉద్యోగిని కొట్టి చంపేశారు...

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (17:56 IST)
బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. దొంగ అని ముద్ర వేసి ఉద్యోగిని సహచర ఉద్యోగులంతా కలిసి కొట్టి చంపేశారు. యూపీలోని షాజహాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. 
 
బంకిం సూరి అనే వ్యక్తి కొన్నేళ్లుగా రవాణా వ్యాపారం చేస్తున్నారు. ఈయన వద్ద శివమ్ జోహ్రీ అనే 32 యేళ్ళ వ్యక్తి ఏడేళ్లుగా మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈ వ్యాపారి కొన్ని వస్తువులను వేరే ట్రాన్స్‌పోర్టు చేరవేశాడు. అయితే, వీటిలో కొన్ని వస్తువులు కనిపించకుండా పోగాయి. దీంతో ఆగ్రహానికి గురైన సూరి అనుమానంతో ట్రాన్స్‌పోర్టులో పని చేసే ఉద్యోగులపై దాడికి పాల్పడ్డాడు. వ్యాపారి మాట మేరకు అతని మనుషులు శివమ్ స్తంభానికి కట్టేసి ఇనుప రాడ్డుతో దారుణంగా కొట్టారు. ఈ దెబ్బలకు తట్టుకోలేక అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆ తర్వాత ఆయన మృతదేహాన్ని షాజహాన్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి బయట పడేసి వెళ్లిపోయారు. మృతదేహాంపై ఉన్నగాయాలను పరిశీలించిన పోలీసులు హత్య ఘటనగా అనుమానించారు. ఈ క్రమంలోనే శివమ్‌ను రాడ్డుతో చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ఆధారంగా బంకిం సూరి, వేరొక ట్రాన్స్‌పోర్ట్‌ యజమాని అయిన నీరజ్‌ గుప్తాతో సహా మరో ఐదుగురిని నిందితులుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments