Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంకుల్ అని పిలిచిన పాపానికి 18 ఏళ్ల బాలికపై దాడి

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (17:32 IST)
అంకుల్ అని పిలిచిన పాపానికి ఉత్తరాఖండ్‌లో 18 ఏళ్ల బాలికపై దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా, సితార్‌గంజ్ పట్టణ పరిధిలోని ఓ ప్రాంతంలో 35 ఏళ్ల దుకాణదారుడిని 18 ఏళ్ల బాలిక అంకుల్‌ అని పిలిచింది. దీంతో ఆ బాలికను ఆ వ్యక్తి దారుణంగా కొట్టాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాదితురాలు నిషా అహ్మద్‌‌గా గుర్తించబడింది. 
 
డిసెంబర్ 19వ తేదీన, టీనేజ్ అమ్మాయి బ్యాడ్మింటన్ రాకెట్ కొనుగోలు చేసింది. మంగళవారం, ఆమె రాకెట్ మార్పిడి కోసం దుకాణానికి వెళ్లగా, దాని తీగలు కొన్ని విరిగిపోవడాన్ని గమనించింది. మోహిత్ కుమార్‌గా గుర్తించబడిన దుకాణదారుడు అతన్ని మామ అని సంబోధించడంతో విసుగు చెంది ఆమెను దారుణంగా కొట్టాడు. బాలిక తలకు గాయం కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. 
 
వైద్య సదుపాయంతో అప్రమత్తమైన పోలీసులు కేసును సుమోటోగా తీసుకున్నారు. అనంతరం బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిందితుడు మోహిత్ కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 354, సెక్షన్ 323, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments