చేపను బిర్యానీలో వేశాడు.. బల్లి అని మోసం చేశాడు.. చివరికి దొరికిపోయాడు..

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (16:03 IST)
బిర్యానీలో బల్లి పడిందని బాగా డబ్బు గుంజాలనుకున్నాడు. కానీ అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన సుందర్ పాల్ అనే వ్యక్తి... ముంబై నుంచి కోయంబత్తూరు వెళ్తూ గుంతకల్ జంక్షన్‌లో దిగాడు. అక్కడ ఫ్లాట్ ఫామ్‌లో వున్న క్యాటరింగ్ స్టాల్‌లో బిర్యానీ ఆర్డర్ చేసి.. సగం తిన్నాడు. 
 
సగం తిన్న తర్వాత బిర్యానీలో బల్లి ఉందని, దాన్ని తినడంతో తనకు అస్వస్థత కలిగిందంటూ స్టాల్ యజమానికి చెప్పాడు. దాంతో ఆయన రైల్వే వైద్యబృందానికి సమాచారం అందించడంతో వారు వచ్చి సుందర్ పాల్ కు చికిత్స చేశారు. 
 
ఈ విషయాన్ని పెద్దది చేస్తానని సుందర్ పాల్ చెప్పడంతో జడుసుకుని ఓనర్ ఐదు వేల రూపాయలు ఇచ్చేశాడు. ఈ వ్యవహారం గుంతకల్ అసిస్టెంట్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వరకు వెళ్లడంతో ఆయన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సాయంతో విచారించారు. 
 
మూడు రోజుల కిందట ఇలాగే జబల్ పూర్ రైల్వే స్టేషన్‌లో కూడా ఓ వ్యక్తి సమోసాలో బల్లి ఉందంటూ రూ.50 వేలు వసూలు చేసినట్టు తెలియడంతో అతడి ఫొటోలు తెప్పించి చూశారు. అందులో ఉన్న వ్యక్తి, తమ ఎదురుగా ఉన్న సుందర్ పాల్ ఒక్కరేనని తెలిసింది. 
 
గట్టిగా నిలదీయడంతో సుందర్ పాల్ తన మోసాలను ఒప్పేసుకున్నాడు. చేపను బిర్యానీలో వేసి బల్లి అని మోసం చేసినట్లు అంగీకరించాడు. సుందర్ పాల్‌పై కఠినచర్యలు తీసుకునేందుకు రైల్వే అధికారులు సిద్ధమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments