Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీలో దారుణం : ట్రక్కుకు కాళ్లను కట్టేసి ఈడ్చుకెళ్లారు...

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (17:02 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ ఆదివాసి తప్పు లేకపోయినప్పటికీ.. అతన్ని కాళ్ళను తాడుతో ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీమూచ్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన కన్హయ్య లాల్ భీల్ (45) అనే ఆగివాసీ తెగకు చెందిన వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అదేసమయంలో చిత్తర్మల్ గుర్జర్ అనే పాల వ్యాపారి బైకుపై వచ్చి లాల్ భీల్‌‌ను ఢీకొట్టాడు. దీంతో బైకుతో పాటు.. ఇద్దరూ కిందపడిపోయారు. 
 
బైకులో ఉన్న పాల క్యాను కూడా కిందపడిపోవడంతో అందులోని పాలు కూడా మొత్తం ఒలిగిపోయాయి. దీంతో కన్హయ్యపై చిత్తర్మల్ దాడికి దిగాడు. తన స్నేహితులను పిలిపించి కొట్టించాడు. ఆ తర్వాత బాధితుడి కాలిని తాడుతో ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లారు. ఒక నిందితుడు అతడి మొహంపై తన్నాడు. బాధతో విలవిల్లాడుతూ అతడు వేడుకున్నా వినలేదు. ఒళ్లంతా రోడ్డుకి రాసుకుపోయి కన్హయ్యకు తీవ్రగాయాలయ్యాయి.
 
పాల వ్యాపారి దుశ్చర్యను చూసిన కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అలాగే, పోలీసులకు కూడా సమాచారం చేరవేశారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకునేలోపు నిందితులు పారిపోయారు.
 
అయితే, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడుని ఆస్పత్రికి తరిలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ ఆయన కనుమూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. నిందితులందరిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments