Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ హింసాత్మక, హంతక పార్టీ: మమతా

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (22:45 IST)
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  బీజేపీతో సంబంధం ఉన్న వారిని ముట్టుకోవడానికి కూడా తమ కార్యకర్తలు ఇబ్బంది పడతారని అన్నారు. 

బీజేపీని హింసాత్మక, హంతకపార్టీగా అభివర్ణించిన మమత.. తృణమూల్ కాంగ్రెస్ గూండాల పార్టీ కాదన్నారు. తన కాళీఘాట్‌ నివాసానికి సమీపంలో పార్టీ కార్యకర్త మృతదేహంతో బీజేపీ గురువారం ఆందోళనకు దిగడంపై మమత మండిపడ్డారు.

‘‘ఎన్నికల తర్వాత చాలా నెలలకు బీజేపీ కార్యకర్త మరణించినట్టు తెలిసింది. ఇలాంటివి దురదృష్టకరం. వారు ఆ మృతదేహంతో నా ఇంటికి వచ్చారు. ఎన్ఆర్‌సీ కారణంగా అస్సాంలో ఎంతోమంది చనిపోయారు. మీకు సిగ్గనిపించడం లేదూ? బీజేపీ పాలనలో చట్టమంటూ ఏమీ ఉండదా?’’ అని మమత విరుచుకుపడ్డారు.

జాతీయ పౌర రిజిస్టర్ ప్రచురణ నేపథ్యంలో అసోంలో చోటుచేసుకున్న మరణాలపై బీజేపీ నేతలను మమత టార్గెట్ చేసుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చట్టమంటూ ఏదీ ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారం ఉప ఎన్నికలు జరగనున్న భవానీపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments