Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ హింసాత్మక, హంతక పార్టీ: మమతా

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (22:45 IST)
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  బీజేపీతో సంబంధం ఉన్న వారిని ముట్టుకోవడానికి కూడా తమ కార్యకర్తలు ఇబ్బంది పడతారని అన్నారు. 

బీజేపీని హింసాత్మక, హంతకపార్టీగా అభివర్ణించిన మమత.. తృణమూల్ కాంగ్రెస్ గూండాల పార్టీ కాదన్నారు. తన కాళీఘాట్‌ నివాసానికి సమీపంలో పార్టీ కార్యకర్త మృతదేహంతో బీజేపీ గురువారం ఆందోళనకు దిగడంపై మమత మండిపడ్డారు.

‘‘ఎన్నికల తర్వాత చాలా నెలలకు బీజేపీ కార్యకర్త మరణించినట్టు తెలిసింది. ఇలాంటివి దురదృష్టకరం. వారు ఆ మృతదేహంతో నా ఇంటికి వచ్చారు. ఎన్ఆర్‌సీ కారణంగా అస్సాంలో ఎంతోమంది చనిపోయారు. మీకు సిగ్గనిపించడం లేదూ? బీజేపీ పాలనలో చట్టమంటూ ఏమీ ఉండదా?’’ అని మమత విరుచుకుపడ్డారు.

జాతీయ పౌర రిజిస్టర్ ప్రచురణ నేపథ్యంలో అసోంలో చోటుచేసుకున్న మరణాలపై బీజేపీ నేతలను మమత టార్గెట్ చేసుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చట్టమంటూ ఏదీ ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారం ఉప ఎన్నికలు జరగనున్న భవానీపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments