Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ హింసాత్మక, హంతక పార్టీ: మమతా

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (22:45 IST)
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  బీజేపీతో సంబంధం ఉన్న వారిని ముట్టుకోవడానికి కూడా తమ కార్యకర్తలు ఇబ్బంది పడతారని అన్నారు. 

బీజేపీని హింసాత్మక, హంతకపార్టీగా అభివర్ణించిన మమత.. తృణమూల్ కాంగ్రెస్ గూండాల పార్టీ కాదన్నారు. తన కాళీఘాట్‌ నివాసానికి సమీపంలో పార్టీ కార్యకర్త మృతదేహంతో బీజేపీ గురువారం ఆందోళనకు దిగడంపై మమత మండిపడ్డారు.

‘‘ఎన్నికల తర్వాత చాలా నెలలకు బీజేపీ కార్యకర్త మరణించినట్టు తెలిసింది. ఇలాంటివి దురదృష్టకరం. వారు ఆ మృతదేహంతో నా ఇంటికి వచ్చారు. ఎన్ఆర్‌సీ కారణంగా అస్సాంలో ఎంతోమంది చనిపోయారు. మీకు సిగ్గనిపించడం లేదూ? బీజేపీ పాలనలో చట్టమంటూ ఏమీ ఉండదా?’’ అని మమత విరుచుకుపడ్డారు.

జాతీయ పౌర రిజిస్టర్ ప్రచురణ నేపథ్యంలో అసోంలో చోటుచేసుకున్న మరణాలపై బీజేపీ నేతలను మమత టార్గెట్ చేసుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చట్టమంటూ ఏదీ ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారం ఉప ఎన్నికలు జరగనున్న భవానీపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments