Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ మొండివైఖరి వల్లే కాంగ్రెస్‌కు ఓటమి : మమతా బెనర్జీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొండివైఖరి వల్లే ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని వెస్ట్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (11:21 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొండివైఖరి వల్లే ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని వెస్ట్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. 
 
శనివారం వెల్లడైన ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా ఎన్నికల్లో ముందుగానే చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాలని రాహుల్ గాంధీకి తాను ఎంతగానో చెప్పానని, పొత్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే కాంగ్రెస్ వైఫల్యం చెందిందని, అదే ఎత్తుగడతో బీజేపీ విజయం సాధించిందన్నారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే ప్రాంతీయ పార్టీలతో భాగస్వామ్యమే ముఖ్యమని రాహుల్‌కు సూచించినా, తన మాటను వినలేదన్నారు. రాహుల్ నిర్లక్ష్యమే బీజేపీకి ఆయువుగా మారిందని, కాంగ్రెస్ నేతలు ఎవరి మాట వింటారో అర్థం కావట్లేదని, సొంత తప్పుల కారణంగానే ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతోందని ఈ మాజీ కాంగ్రెస్ మహిళా ఫైర్‌బ్రాండ్ ఆవేదన వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

పుష్ప 2 లో సెకండ్ సింగిల్ ను 6 భాషల్లో పాడిన మెలోడీ క్వీన్ శ్రేయఘోషల్

కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్ . రూ. 17.70 కోట్ల‌కు అమ్ముడైన‌ ఆడియోరైట్స్

గం..గం..గణేశా యాక్షన్ కామెడీ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - నిర్మాత వంశీ కారుమంచి

డ్యాన్స్ బేస్డ్ సినిమా చేయాలనే కోరిక ఉంది : హీరోయిన్ ఐశ్వర్య మీనన్

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే సోల్‌ఫుల్ టైటిల్ ట్రాక్ విడుదల

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

తర్వాతి కథనం
Show comments