Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బ్యాంకు సిబ్బందికి లంచాలుగా వజ్రాలు.. బంగారు ఆభరణాలు

దేశంలో వెలుగు చూసిన అతిపెద్ద స్కామ్‌లలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణం. గుజరాత్ (సూరత్) రాష్ట్రానికి చెందిన వజ్రాలు, బంగారు ఆభరణాల వ్యాపారి నీరవ్ మోడీ బ్యాంకు అధికారులను, సిబ్బందిని బురిడీ కొ

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (10:50 IST)
దేశంలో వెలుగు చూసిన అతిపెద్ద స్కామ్‌లలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణం. గుజరాత్ (సూరత్) రాష్ట్రానికి చెందిన వజ్రాలు, బంగారు ఆభరణాల వ్యాపారి నీరవ్ మోడీ బ్యాంకు అధికారులను, సిబ్బందిని బురిడీ కొట్టించి ఏకంగా రూ.12 వేల కోట్ల మేరకు రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయాడు. 
 
అయితే, ఇన్ని వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి ఆ బ్యాంకు సిబ్బంది పూర్తి స్థాయిలో తమవంతు సహాయసహకారాలు అందించారు. ఇందుకోసం వారికి నీరవ్ మోడీ వజ్రాలు, బంగారు ఆభరణాలను లంచాలుగా ఇచ్చాడు. ఈ విషయం సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. 
 
బ్యాంకులోని ఉద్యోగులకు వారి స్థాయిని బట్టి బంగారు నాణాల నుంచి వజ్రాభరణాల వరకూ నీరవ్ కానుకలుగా ఇచ్చాడని, వీటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని సీబీఐ తరపు న్యాయవాది సీబీఐ కోర్టుకు వెల్లడించారు. బ్యాంకు తరపున తప్పుడు ఎల్ఓయూ (లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్)లు తీసుకునేందుకు లంచాలు ఇచ్చారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకూ 14 మందిని అరెస్ట్ చేశామని, వీరందరికీ నీరవ్ మోడీ, మేహుల్ చౌక్సీల నుంచి ఏదో ఒక రూపంలో లంచాలు అందాయని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments