Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బ్యాంకు సిబ్బందికి లంచాలుగా వజ్రాలు.. బంగారు ఆభరణాలు

దేశంలో వెలుగు చూసిన అతిపెద్ద స్కామ్‌లలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణం. గుజరాత్ (సూరత్) రాష్ట్రానికి చెందిన వజ్రాలు, బంగారు ఆభరణాల వ్యాపారి నీరవ్ మోడీ బ్యాంకు అధికారులను, సిబ్బందిని బురిడీ కొ

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (10:50 IST)
దేశంలో వెలుగు చూసిన అతిపెద్ద స్కామ్‌లలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణం. గుజరాత్ (సూరత్) రాష్ట్రానికి చెందిన వజ్రాలు, బంగారు ఆభరణాల వ్యాపారి నీరవ్ మోడీ బ్యాంకు అధికారులను, సిబ్బందిని బురిడీ కొట్టించి ఏకంగా రూ.12 వేల కోట్ల మేరకు రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయాడు. 
 
అయితే, ఇన్ని వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి ఆ బ్యాంకు సిబ్బంది పూర్తి స్థాయిలో తమవంతు సహాయసహకారాలు అందించారు. ఇందుకోసం వారికి నీరవ్ మోడీ వజ్రాలు, బంగారు ఆభరణాలను లంచాలుగా ఇచ్చాడు. ఈ విషయం సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. 
 
బ్యాంకులోని ఉద్యోగులకు వారి స్థాయిని బట్టి బంగారు నాణాల నుంచి వజ్రాభరణాల వరకూ నీరవ్ కానుకలుగా ఇచ్చాడని, వీటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని సీబీఐ తరపు న్యాయవాది సీబీఐ కోర్టుకు వెల్లడించారు. బ్యాంకు తరపున తప్పుడు ఎల్ఓయూ (లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్)లు తీసుకునేందుకు లంచాలు ఇచ్చారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకూ 14 మందిని అరెస్ట్ చేశామని, వీరందరికీ నీరవ్ మోడీ, మేహుల్ చౌక్సీల నుంచి ఏదో ఒక రూపంలో లంచాలు అందాయని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments