Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంతానికి పచ్చజెండా :: నందిగ్రామ్ నుంచే బరిలోకి.. దమ్ముంటే కాస్కోండి!

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (15:30 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తాను పోటీ చేసే స్థానంపై ఓ క్లారిటీ ఇచ్చారు. అందరూ అనుకున్నట్టుగానే ఆమె పంతానికి పచ్చజెండా ఊపారు. నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. 
 
త్వరలో దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ కూడా ఒకటి. అయితే, అధికార టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసే స్థానంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆమె ఇప్పటివరకు భవానీపూర్ నుంచే బరిలోకి దిగుతూ వచ్చారు. అయితే, ఈ ఎన్నికల్లో మాత్రం మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడానికి ఈసారి మాత్రం ఆమె నందిగ్రామ్‌ను ఎంచుకున్నారు. 
 
ఇటీవలే బీజేపీలో చేరిన స్ట్రాంగ్ మ్యాన్ సుబేందును, బీజేపీని రాజకీయంగా ఎదుర్కోడానికి ఈసారి ఆమె నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఆమె సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ పోటీకి దిగుతున్నారు. 
 
మరోవైపు 294 స్థానాలకు గాను ఆమె అభ్యర్థులను ప్రకటించారు. అందరూ 80 సంవత్సరాల లోపు వయస్సు వారే. అందులో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 79 మంది షెడ్యూల్ కులాలు, 17 మంది షెడ్యూల్ తెగలకు చెందిన అభ్యర్థులు ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments