Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి మమతా బెనర్జీ షాక్

Webdunia
శనివారం, 10 జులై 2021 (07:12 IST)
అధికార తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకి ‘టెక్నికల్’ షాక్ ఇచ్చారు. బీజేపీ టిక్కెట్‌పై విజయం సాధించి, తిరిగి సొంతగూటికి చేరిన ముకుల్ రాయ్‌కు కీలక పదవిని అప్పజెప్పారు.పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌ (పీఏసీ) గా ముకుల్ రాయ్‌ను నియమిస్తూ సీఎం బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు.

ఈయన నియామకాన్ని అసెంబ్లీ స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ కూడా ఆమోదం తెలిపారు. వాస్తవానికి పీఏసీ చైర్మన్ ప్రతిపక్ష నేతకు ఇవ్వడం అన్ని రాజకీయ పక్షాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఈ ఒకే ఒక్క వ్యూహంతో సీఎం మమత బీజేపీని ఇరుకున పెట్టారు.

టెక్నికల్‌గా ముకుల్ రాయ్ ఇంకా బీజేపీ ఎమ్మెల్యేయే. ప్రతిపక్ష నేతకు ఇవ్వాలన్న సంప్రదాయాన్ని తాము పాటించినట్లూ జరిగింది. అదే సమయంలో తమ పార్టీకే చెందిన ముకుల్ రాయ్‌‌కే ఈ పదవి ఇచ్చినట్లైంది. ఈ వ్యూహంతో బీజేపీ ఇరుకునపడినట్లేనని తృణమూల్ నేతలు పేర్కొంటున్నారు.

అయితే ముకుల్ రాయ్ నియామకంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. బీజేపీ టిక్కెట్‌పై ఆయన విజయం సాధించారని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేత సుబేందు నేతృత్వంలో ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ముకుల్ రాయ్‌ను పీఏసీ చైర్మన్‌గా నియమించి, అధికార తృణమూల్ నియమ నిబంధనలను తుంగలో తొక్కిందని సుబేందు తీవ్రంగా దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments