Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా బెనర్జీ ఓ సూర్పణఖ : బీజేపీ ఎమ్మెల్యే

అధికారమత్తులో జోగుతున్న భారతీయ జనతా పార్టీ నేతల నోటికి తాళం పడటం లేదు. మొన్నటికిమొన్న బీఎస్పీ అధినేత మయావతిని వ్యభిచారిణిగా సంభోదించిన బీజేపీ నేతలు ఇపుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (13:59 IST)
అధికారమత్తులో జోగుతున్న భారతీయ జనతా పార్టీ నేతల నోటికి తాళం పడటం లేదు. మొన్నటికిమొన్న బీఎస్పీ అధినేత మయావతిని వ్యభిచారిణిగా సంభోదించిన బీజేపీ నేతలు ఇపుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీని సూర్పణఖతో పోల్చారు.
 
ఆయన పేరు సురేంద్ర సింగ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బైరియా ఎమ్మెల్యేగా ఉన్నారు. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ సర్కారు హయాంలో హిందువులపై దాడులు జరుగుతుండటంతో ఈయన ఆ తరహా విమర్శలు గుప్పించారు. హింస జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు.
 
'మమతా బెనర్జీ సూర్పణఖ పాత్రను పోషిస్తున్నారు. వీధుల్లో ప్రజలను చంపుతున్నా ముఖ్యమంత్రిగా ఆమె ఏమీ చేయడం లేదు. బెంగాల్లో హిందువులకు రక్షణ లేదు. ఇలానే వదిలేస్తే పరిస్థితి జమ్మూకాశ్మీర్ తరహాలో మారిపోతుంది. జమ్మూకాశ్మీర్ నుంచి హిందువులు వలస వెళ్లిన పరిస్థితే పశ్చిమబెంగాల్లోనూ ఏర్పడుతుంది' అని సురేంద్ర  సింగ్ వ్యాఖ్యానించారు. 
 
భారతీయ జనతా పార్టీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీ నేతలకు ఇటీవలే హితవు పలికారు. మైక్ ఉందికదాని ఇష్టానుసారంగా నోటిని పారేసుకోవద్దనీ, దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందటూ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, బీజేపీ నేతల నోటికి తాళం పడటం లేదు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments