Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో ఘోరం - లారీ - బస్సు ఢీ - 9 మంది మృతి

Webdunia
మంగళవారం, 24 మే 2022 (09:42 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. బస్సు, లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందివరకు గాయపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ - ధర్వాడ్‌లో పూణె - బెంగుళూరు జాతీయ రహదారిపై తారిహా బైపాస్ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగింది. 
 
కొల్లపూర్‌ నుంచి బియ్యం లోడుతో వెళుతున్న లారీ ఒకటి, ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురెదురుగా ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ, బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జు అయిపోయాయి. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో వ్యక్తి, బస్సులోని నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో మరో ముగ్గురు చనిపోయారు. 
 
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మరో 23మ మంది గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలోని క్షతగాత్రులను హుబ్లీ కమిషనర్ పరామర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments