Webdunia - Bharat's app for daily news and videos

Install App

టంగుటూరులో ఘోర రైలు ప్రమాదం.. రూ.80లక్షల నష్టం.. పట్టాలు తప్పడంతో?

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (12:07 IST)
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్సు రైలు నాయుడుపాలెం-బాపూజీనగర్ మధ్య సూరారెడ్డి పాలెం వద్ద వంతెన దాటుతుండగా చివరన బోగీలు విడిపోయి మంటలు అంటుకున్నాయి. ట్రాక్ కుంగిపోవడంతో బోగీలు పట్టాలు తప్పాయి. దాంట్లో డీజిల్‌ ఉండడంతో వెంటనే మంటలు చెలరేగాయి.
 
ఈ ప్రమాదంలో రూ.80లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే.. 200మీటర్ల మేర రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. 
 
మంటలను అదుపు చేయలేకపోతే మిగిలిన బోగీలకు కూడా మంటలు అంటుకునేవని అధికారులు చెప్పారు. భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాక్ కుంగిపోవడం వల్లే ప్రమాదం సంభవించినట్టు అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments